ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ) ఖాతాదారుల కోసం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సరికొత్త సేవలను ప్రకటించింది. 12 దేశాల నుంచి అంతర్జాతీయ మొబైల్ నంబరుతోనూ ఉచితంగా యూపీఐ చెల్లింపులు చేసే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, హాంకాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), యునైటెడ్ కింగ్డమ్ (యూకే), అమెరికా నంబర్లకూ ఈ సేవ అందుబాటులో ఉండనుంది. ఈ దేశాల్లోని ఎన్ఆర్ఐలు భారతీయ సిమ్కార్డు అవసరం లేకుండానే, అక్కడి తమ మొబైల్ నంబరును ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఖాతాలకు అనుసంధానం చేసి, యూపీఐ లావాదేవీలు చేయొచ్చు. ఈ యూపీఐ చెల్లింపులపై లావాదేవీ రుసుములు, విదేశీ మారకపు ఛార్జీలు ఉండవని బ్యాంకు వెల్లడించింది. క్యూఆర్ కోడ్లు, యూపీఐ ఐడీలు, మొబైల్ నంబర్ల ద్వారా తక్షణమే డబ్బు బదిలీ, బిల్లు చెల్లింపు, వ్యక్తులకు డబ్బు పంపడం లాంటి సేవలు లభిస్తాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఖాతాలను గూగుల్ పే, ఫోన్పే వంటి యాప్లతోనూ అనుసంధానం చేసి, చెల్లింపులు చేసేందుకు వీలుంటుంది.
ఇలా చేయాలి: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మొబైల్ యాప్లో లాగిన్ అయ్యాక, పే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఎన్ఆర్ఓ/ఎన్ఆర్ఈ ఖాతాను అనుసంధానం చేయాలి. యూపీఐ ఐడీ సృష్టించుకుని, చెల్లింపులు చేయొచ్చు.
