అమరావతి మహిళ పై అనుచిత.. అసభ్య వాఖ్యల వివాదంలో సాక్షి ఛానల్ ప్రముఖ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి లో కొమ్మినేని నిర్వహించిన చర్చలో జర్నిలిస్టు క్రిష్ణంరాజు చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున నిరసన లు వ్యక్తం అయ్యాయి. అమరావతి రైతులు.. మహిళల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. హైదరాబాద్ లో కొమ్మినేని ని అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు తీసుకొస్తున్నారు. ఇదే కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రిష్ణంరాజు పైన కేసు నమోదైంది. సాక్షి యాజమాన్యం పైన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసారు.
