jకోలాహలం…
బీచ్ ఫెస్టివల్ ని ప్రారంభించిన మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్
కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం సముద్ర తీరంలో మసులా బీచ్ ఫెస్టివల్స్ ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం సాయంత్రం ప్రారంభించారు..తొలుత బీచ్ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గేట్ వే ఆఫ్ అమరావతి ఐకానిక్ టవర్ ను ఇరువురు మంత్రులు ప్రారంభించారు. అనంతరం 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు స్వాగతం పలికారు.

తొలిరోజే బీచ్ ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పర్యాటకులు ఖుషీ అయ్యారు..నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ బీచ్ ఫెస్టివల్స్ కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన అధికారులు.
బీచ్ ఫెస్టివల్ లో భాగంగా నేషనల్ వాటర్ స్పోర్ట్స్ ని మంత్రులు దుర్గేష్, రవీంద్ర ప్రారంభించారు. ఈ ప్రారంభకార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ విప్పు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపర్యాటక శాఖ చీప్ సెక్రటరీ, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ,కలెక్టర్ బాలాజీ , ఎస్పీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
