దేశం విడిచిపెట్టకుండా పాస్ పోర్టు స్వాధీనం చేయాలని ఆదేశం
ఏపీ ఎనాలిసిస్, హైదరాబాద్
ఓబులాపురం మైనింగ్ కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి (Gali Janardhan Reddy) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. ఓఎంసీ కేసులో గాలి సహా దోషులందిరికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి శాసనసభ సభ్యత్వం పోకుండా సీబీఐ కోర్టు (CBI Court) ఇచ్చిన తీర్పుపై హైకోర్టు న్యాయస్థానం స్టే విధించింది. రూ.10 లక్షలతో రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇండియా విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలులేదని స్పష్టం చేసింది. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
