పులివెందుల పర్యటన రద్దు
ఏపీ అనాలిసిస్, విజయవాడ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆయన పులివెందుల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించిన జగన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అయితే ఆ తర్వాత జ్వర తీవ్రత పెరగడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాబోయే కార్యక్రమాలు కూడా వాయిదా పడినట్లు సమాచారం.
