ముందు విచారణ.-ఆ తరువాతనే చేేరికి
టీడీపీలో చేరికలపై అధిష్టానం షరతులు విధించింది. ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే ముందు కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని, వారిపై విచారణ చేసిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నుంచి పలువురు నేతలు టీడీపీలో చేరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతలు పార్టీలోకి వచ్చేశారు. అయితే వీరిలో కొందరు కోవర్టులు ఉన్నారని చంద్రబాబు స్వయంగా కడప మహానాడు వేదికగా కామెంట్ చేశారు. వీరి వలన నియోజకవర్గ స్థాయిలో గ్రూప్ వార్ కూడా పెరిగే అవకాశం ఉందని భావించారు.
| ReplyForwardAdd reaction |
