
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ
కృష్ణా డిసిఎంఎస్ చైర్మన్ గా మచిలీపట్నం చెందిన జనసేన పార్టీ నాయకులు బండి రామకృష్ణ నియమితులయ్యారు. సోమవారం పది జిల్లాలకు డిసిసిబి చైర్మన్ లను నియమించిన ప్రభుత్వం అలాగే మరో 10 మంది డిసిఎంఎస్ చైర్మన్ లను నియమించారు. వారిలో కృష్ణాజిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గా బండి రామకృష్ణ నియమితులు కాగా మిగిలిన 9 జిల్లాలకు నూతన డిసిఎంఎస్ చైర్మన్ల నియామకం జరిగింది.
