Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » తిరుపతి శ్రీ సిటీకి మరో అంతర్జాతీయ సంస్ధ
ఆంధ్రప్రదేశ్

తిరుపతి శ్రీ సిటీకి మరో అంతర్జాతీయ సంస్ధ

apanalysisBy apanalysisMay 4, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


రూ.5 వేల కోట్లు పెట్టుబడితో వస్తున్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్
ఇండియాలో ఆ సంస్ధకు మూడో ప్లాంట్
ప్రభుత్వం నుంచి ఇతోధిక ప్రోత్సాహకాలు

ఏపీ స్టేట్ బ్యూరో:
తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో మరో అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడిలో తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఎల్‌జీ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎల్‌జీ ప్లాంట్ కోసం మే 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు శ్రీసిటీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఎల్‌జీ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం కూడా పలు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిసింది. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏపీకి ఎల్‌జీ పరిశ్రమను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కృషి చేసినట్లు చెప్పుకొచ్చారు.
ఎల్‌జీ కంపెనీకి ప్రస్తుతం దేశంలో రెండే తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి పుణెలో, మరొకటి నోయిడాలో ఉంది. ఇక మూడో తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఎల్‌జీ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. మూడో ప్లాంట్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఏపీలోని శ్రీసిటీని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. శ్రీసిటీలో ఏర్పాటయ్యే ఎల్‌జీ తయారీ ప్లాంట్‌లో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, కంప్రెషర్లు వంటి కంజ్యూమర్ ఎలక్ర్టానిక్స్ తయారు చేయనున్నారు. ప్లాంట్ ఏర్పాటైన రెండు నుంచి మూడేళ్ల తర్వాత వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఎల్‌జీ పరిశ్రమ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిసింది. 20 ఏళ్ల పాటు నీటి సరఫరాలో వందశాతం రాయితీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సమాచారం. శ్రీసిటీలో ఏర్పాటయ్యే ఎల్‌జీ ప్లాంట్ ద్వారా ఇటు రాయలసీమతో పాటుగా పొరుగున ఉన్న నెల్లూరు జిల్లాకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాంతంలో పారిశ్రామికవృద్ధితో పాటుగా స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని అధికారులు చెప్తున్నారు. ఇక శ్రీసిటీని 2008లో ప్రారంభించారు. నాలుగు పోర్టులు, రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలకు శ్రీసిటీ అనుసంధానమైంది. దీంతో లాజిస్టిక్ హబ్‌గా శ్రీసిటీ రూపుదిద్దుకుంటోంది. ఇప్పుడు ఎల్‌జీ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.

Post Views: 38
amara hospitals tirupati commercial plot for sale in tirupati commercial property for sale in tirupati farm land for sale in tirupati flat for sale in tirupati house for sale in tirupati independent house for sale in tirupati land for sale in tirupati open plots for sale in tirupati plot for sale in tirupati property for sale in tirupati tirupati tirupati amara hospital tuda approved plots for sale in tirupati
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.