దగా డీస్సీ- షర్మిలా
అభ్యర్ధులకు ప్రిపరేషన్ గడువు పెంచాలి.
M.GANESH. Vja.
డిఎస్సీ విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా అన్నారు. వారంతా మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదని,. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నించు.ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అని ఆరోపణ చేశారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమంటున్నారని తెలిపారు. మూడున్నర లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెడుతున్నారని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనమని చెప్పారు.
డీఎస్సీ నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలన్నారు, ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలని కోరారు. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా డిఎస్సీ పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలని ఆమె కోరారు.
