హరియాణాలోని జీంద్లో నలుగురు దుండగులు అయిదేళ్ల చిన్నారిని హత్య చేసి, తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు మంగళవారం రాత్రి భర్త లేని సమయం చూసి గుడిసెలోకి చొరబడ్డారు. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై దాడి చేశారు. ఆమెతోపాటు అయిదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్తకుప్ప వద్దకు ఎత్తుకెళ్లారు. అక్కడ చిన్నారి గొంతునులిమి హత్య చేసి, బాధితురాలిపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. గురువారం స్పృహలోకి వచ్చిన మహిళ జరిగిన దారుణాన్ని పోలీసులకు వెల్లడించింది. నిందితుల్లో అమిత్ అనే వ్యక్తితోపాటు ముగ్గురు మైనర్లు ఉన్నట్లు ఎస్.ఐ. యశ్వీర్ తెలిపారు.
