సూపర్ స్పీడ్తో సూపర్ సిక్స్ హామీలు:
కూటమి పాలనలో సంక్షేమం రెట్టింపు
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ
రాష్ట్రంలో కూటమి పాలనలో సూపర్ సిక్స్ పథకాల అమలు సూపర్ స్పీడ్తో సాగుతున్నట్లు రాష్ట్ర ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు, “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం ద్వారా సుపరిపాలన అందిస్తోందన్నారు. మాటలతో కాదు, చేతల్లో చేసి చూపించడం నిజమైన సుపరిపాలన అని నమ్మిన సీఎం చంద్రబాబునాయుడు అదే విధంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని కొనియాడారు”
సూపర్ సిక్స్ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా లాభం చేకూరుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల పాలనలో సుమారు రూ.70 వేల కోట్లు సూపర్ సిక్స్ పథకాలకు కేటాయించిందని, పెన్షన్ల కోసమే రూ.51 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆగస్టు 15 నుంచి అమలు చేసిన ఉచిత బస్సు పథకం “స్త్రీ శక్తి”కి ఇప్పటికే రూ.1200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, ఇమామ్ మౌజమ్ల కోసం రూ.135 కోట్లు, పాస్టర్ల గౌరవ వేతనాలకు రూ.81 కోట్లు, హజ్ యాత్రికులకు లక్ష సహాయం అందజేయడం కొనసాగుతోందని పేర్కొన్నారు. 205 అన్నక్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు 7 కోట్లకు పైగా ప్రజలకు భోజనం అందించగా, ఒక్క సంతకంతో నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులు భర్తీ అయ్యాయని వివరించారు.
