పున్నమితోట టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి
వేలాదిగా తరలివచ్చిన భక్తులు.
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
పున్నమితోట టీటీడీ కళ్యాణ మండపంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామి వారి దర్శనం పొందేందుకు మంగళవారం ఉదయం నుంచే భక్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేదీప్యమానంగా అలంకరించిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు, టీటీడీ సిబ్బంది, సేవకు వచ్చిన స్వచ్చంధ కార్యకర్తలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన ప్రతీ భక్తునికి ప్రసాద వితరణ చేశారు.

మధ్యాహ్నం దాదాపు 10 వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. జిల్లా అధికారులు, నగరంలోని ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకుని తరించారు. ఆలయ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు, ఇన్స పెక్టర్ రమాదేవి ఆలయ అర్చకులు మురళి, శశి , హేమంత్ ఆనంద్ , నిర్వహకులు విజయ్ కుమార్ , ప్రసాద్ ప్రసాద్ రెడ్డి, ఏడుకొండలు, సుబ్రహ్మణ్యం మహిళా భక్తులు శాంతి శ్రీ తులసి రాజేశ్వరి పాల్గొన్నారు.
