ప్రజలకు ఉపయోగపడేలా రుషికొండ ప్యాలెస్
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ను ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడో సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. సమావేశం అనంతరం మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ మాట్లాడుతూ హాస్పిటాలిటీ రంగానికి ప్యాలెస్ను వినియోగించాలనే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. అయితే సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండ కింద ఉన్న 9 ఎకరాల్లో 7 ఎకరాల్లో నిర్మాణాలు చేయడానికి వీలులేదని, వాస్తవంగా వినియోగానికి వచ్చే 2 ఎకరాలను ఎలా ఉపయోగించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. కొన్ని ప్రముఖ సంస్థలు ముందుకొచ్చినా ప్రాజెక్టు వయబుల్గా ఉండేలా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 28న మరోసారి సమావేశం నిర్వహించి తుది ప్రతిపాదనలను రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు మంత్రులు వెల్లడించారు.
