అధిక సంఖ్యలో హాజరైన భక్తులు
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ
విజయవాడ పున్నమ్మతోటలోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్ధానంలో శనివారం నుంచి అష్టబంధన జీర్ణోద్దారణ మహా సంప్రోక్ష్లణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం9 గంటల నుంచి 12 గంటల వరకు నవగ్రహారాధన, నవగ్రహ మఖము, ప్రధాన హోమములు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని తిలకించారు. సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు ఉక్త హోమములు, కుంభారాధనలు, అభిమంత్రణములు వైభవంగా జరిగాయి. ఆలయ అధికారులు మల్లికార్జునరావు, లలిత, ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ, శశికిరణ్, ఆనంద్ భక్తులు వేణు, విజయకుమార్, ప్రసాద్ రెడ్డి, న్యాయవాదులు ప్రసాద్ వెంకటేశ్వరరావు, ఏడుకొండలు, ట్రాన్స్ పోర్టు కంట్రాక్టరు వెన్న నారాయణరావు, వేదపండితులు పాల్గొన్నారు.
