వెల్లివిరుస్తన్న ఆధ్యాత్మిక శోభ
-నమో వెంకటేశాయ మంత్రోచ్చరణతో తరిస్తున్న భక్తజన సందోహం
వేద పండితుల ఉపన్యాసాలు, హితోక్తులకు మంత్ర ముగ్ధులౌతున్న భక్తులు
ప్రశాంత వాతావరణంలో వైదిక కార్యక్రమాలు
ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ఏర్పాటుకు భక్తుల వినతి
ఎం.గణేశ్, ఏపీ ఎనాలిసిస్
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో స్ధానిక పున్నమ్మతోట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైదిక కార్యక్రమాలు అత్యంత వైభవం జరుగుతున్నాయి. అష్టబంధన మహా సంప్రోక్ష్లణ కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాతిక కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం 9 గంటల నుంచి అష్ట బంధన ద్రవ్యారాధనము, మహాశాంతి హోమములు, ఉష్టబంధనములు మద్యాహ్నం 1 గంట వరకు కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు దాతల సహకారంతో భోజన సౌకర్యాన్ని ఆలయ కమిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి విశేష మహాశాంతి తిరుమంజనము, ధాన్యాధివానము, సర్వదైవత్య హోమము, దోష ప్రాయశ్చిత హోమములు వైభవంగా జరిగాయి. దేవాలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ ప్రస్పుటంగా గోచరించింది. కార్యక్రమాలు విజయవంతం కావడానికి, పూజాధికార్యక్రమాలకు అవసరమైన పండ్లు, పువ్వులు, ఇతర ద్రవ్వాలను దేవాలయానికి నిత్యం వచ్చే భక్తులు ఎక్కువుగా సమకూర్చారు.

కార్యక్రమంలో ఆలయ అధికారులు మల్లికార్జున, లలిత, వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు శశి కిరణ్ , మురళి, ఆనంద్ , భక్తులు విజయకుమార్, ప్రసాద్ రెడ్డి, సంజీవరెడ్డి, న్యాయవాదులు ప్రసాద్, ఏడుకొండలు రాజేశ్వరి, తులసి, శాంతి, మురళి దంపతులు, నారాయణరావు అప్పారావు ఆలయ అధికారులు పాల్గొన్నారు. కాగా, తిరుమల తిరుపతి దేవస్ధానం నుంచి వచ్చిన వేద పండితుల ఉపన్యాసాలు భక్తులను అలరిస్తున్నాయి. హిందూమత సంప్రాదాయాలును వెల్లడిస్తూనే పిల్లలను కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తీసుకురావాలని సూచిస్తున్నారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చివరి రోజైన గురువారం పెద్ద సంఖ్యలో భక్తులకు అన్నప్రసాదాలు అందచేయనున్నారు. శ్రీవారు గురువారం ఆలయ ప్రవేశం చేయనున్నారు. ఈ సందర్భంగానే పలు కార్యక్రమాలు కూడా కొనసాగనున్నాయి.
—
