మహిళా క్రికెటర్లకు స్పూర్తినిచ్చిన లోకేష్ సెల్ఫీ
సోషల్ మీడియాలో నయా ట్రెండ్
ఎం.గణేశ్, జర్నలిస్టు .
మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీ చరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతి, ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో 1000 చ.గ. స్థలం, రాష్ట్ర ప్రభుత్వం లో గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం కల్పిస్తామని స్పష్టం చేశారు. క్రికెట్ అభిమానులు అంతా సీఎం నిర్ణయం వెలువడిన వెంటనే హర్షం వ్యక్తం చేశారు. ఇంత వరకు భాగానే ఉంది. అయితే అరగంట తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో విడుదల చేసిన సెల్ఫీ అంతకు మించి ట్రెండ్ అయింది. సీఎం ఇచ్చిన నజారానా కంటే ఆయన తనయుడు ఇచ్చిన ప్రోత్సాహం విలువైందనే అభిప్రాయం వ్యక్తం అయింది. శ్రీ చరణితో ముఖ్యమంత్రితోపాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా ముచ్చటించారు. సీఎం నజారానా ప్రకటించిన తరువాత ఆయన కుమారుడు లోకేష్ స్వయంగా ముందుకు వచ్చి శ్రీచరణి, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సెల్ఫీతీసీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సెల్ఫీ రాష్ట్రంలో మహిళా క్రికెట్ అభిమానులను మరింత ఆకట్టుకుంది. అనేక మంది హర్షం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం నయా ట్రెండ్ నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోది లాంటి అతిరథ మహారధులు పర్యటనలకు వెళ్లిన సమయంలో వారే స్వయంగా సెల్పీలు తీసి షేర్ చేయడం జరుగుతోంది. ఇటువంటి వాటికి అంతే రీతిలో ప్రాధాన్యత లభిస్తోంది. మంత్రి లోకేష్ ఇదే తరహాలో వ్యవహరించి సెల్పీని షేర్ చేశారు.
