మనసుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకోవటానికి ఆహారం బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం కొంతమంది కాఫీ, టీలను ఆశ్రయిస్తుంటే.. మరికొందరు స్వీట్ల వంటివి తెగ లాగించేస్తుంటారు. నిజానికి ఇవి మనసుని ఉత్సాహ పరచినా వీటితో దుష్రభావాలు ఎక్కువ. అంతకన్నా పోషకాలు దండిగా కలిగిన ఆహార పదార్థాలు తినటం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి చాలా త్వరగా మూడ్నీ మార్చేస్తాయని వివరిస్తున్నారు. 
మోనోసాచ్యురేటెడ్ కొవ్వు, పొటాషియం:
 ఇవి మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడులోని నాడీకణాలు ఉత్తేజంగా ఉండేలా చేయటంలో పొటాషియం తోడ్పడుతుంది. బాదంపప్పు, వేరుశనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వు.. అరటిపండు, చిలగడ దుంపల్లో బాగా పొటాషియం లభిస్తాయి. 
ట్రైప్టోఫాన్: 
మూడ్ని నియంత్రించటంలో సెరటోనిన్ పాత్ర చాలా కీలకం. ఇది మెదడులో న్యూరో ట్రాన్స్మీటర్గా పనిచేస్తుంది. ఈ సెరటోనిన్ ఎక్కువగా లభించాలంటే పాలు, చేమదుంపలు, చేమకూర, జీడిపప్పులను తింటే సరి. 
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు:
 మానసిక ఏకాగ్రత, విశ్రాంతి, కలుపుగోలుతనం పెంపొందటానికి ఒమేగా-3 కొవ్వులు సాయం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఈ కొవ్వులు లోపించటం వల్ల కుంగుబాటు, చిరాకు బాధించే అవకాశం ఉంది. అందుకే వీటిని పొందాలంటే ఆకుకూరలు.. చేపలు.. అవిసెగింజలు తీసుకుంటే మేలు.
ఫోలిక్ యాసిడ్, బి6 విటమిన్: 
కుంగుబాటుని దూరం చేసేందుకు ఈ రెండు విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి తాజా కూరగాయలు, కాలేయం, పప్పుల్లో దండిగా ఉంటాయి. 
Share.
Leave A Reply

Exit mobile version