కావలసిన పదార్థాలు
బియ్యం – 1కప్పు, బెల్లం – 2 కప్పులు, జీడిపప్పు – 10-12, పెసరపప్పు – 1/2 కప్పు, నెయ్యి – 1/4 కప్పు, కిస్మిస్ – 20-25
తయారు చేసే విధానం : 
బియ్యం, పెసరపప్పు శుభ్రంగా కడిగి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. బెల్లంలో ఒక కప్పు నీళ్ళుపోసి ముదురు పాకం వచ్చిన తరువాత బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని కలిపి 3,4 నిమిషాలు ఉడికించండి. దీనికి వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ మరియు, యాలకలపొడి జల్లి కలిపి వడ్డించండి.

Share.
Leave A Reply

Exit mobile version