ఏపీస్టేట్ బ్యూరో.
014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ వివరించారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. అసలు నిజమైన స్కామ్ స్టర్ ఎవరూ?..చంద్రబాబు కాదా? 2014–2019 మధ్య చేసిన లిక్కర్ స్కామ్లో చంద్రబాబు బెయిల్పై లేడా? ఇది వాస్తవం కాదా? ఆ రోజు చంద్రబాబు చేసిన స్కామ్ చెబుతా చూడండి.
రాష్ట్రంలో 4380 లిక్కర్షాపుల కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియను రిగ్గింగ్ చేశారు. తన ఎమ్మెల్యేలు, తన మంత్రులు, తన బినామీలు రిగ్గింగ్ చేసి తన మనుషులకు షాపులు ఇప్పించుకున్నారు. ఈ షాపులన్నింటిని ఒక సిండికెట్ మాఫియాగా తయారు చేశారు. వీటికి పక్కనే ఇల్లీగల్గా పర్మిట్ రూమ్లు, 40 వేల బెల్ట్షాపులు నడిపారు. ఎక్కువ రేటుకు మద్యాన్ని అమ్మారు. అప్పుడు కూడా ఇలాగే ప్రైవేట్షాపుల సిండికేట్, ఈయనకు కావాల్సిన డిస్టరీలకు మేలు చేసే వి«ధంగా ఆర్డర్స్ చేశారు. తనకు కావాల్సిన కంపెనీలతో ఇండెంట్ ఇప్పించారు. 2015– 2019 మధ్యలో చంద్రబాబు ఐదు కంపెనీలకు 69 శాతం ఆర్డర్స్ దక్కాయి. కొన్ని బ్రాండ్లకు కృత్రిమ డిమాండ్లు సృష్టించారు.
2014 నవంబర్లో జీవో 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్స్ బెఖాతర్ చేస్తూ డిస్టరీల కెపాసిటీ కొన్నింటికి ఎక్సుక్యూజీవ్గా చంద్రబాబు రెకమొండ్ చేశారు. తరువాత 2012 నుంచి అమలులో ఉన్న ఫ్రివలేజ్ ఫీజును తొలగించి చంద్రబాబు తన ప్రైవేట్ షాపుల మాఫియాకు లబ్ధి చేకూర్చారు. 2015 డిసెంబర్ 11న జీవోను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన నోట్ఫైల్లో స్వయంగా చంద్రబాబే సంతకం చేశారు. మూడుసార్లు చంద్రబాబు సంతకం చేసి విత్ అవుట్ కేబినెట్ అప్రూవల్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చుతూ చంద్రబాబు సంతకం చేసిన ఫైల్ను కాగ్ కూడా తప్పు పట్టింది. ఇవన్నీ ఉన్నా నేపథ్యంలో చంద్రబాబుపై బలమైన కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు ఆ కేసుపై ఇప్పుడు బెయిల్పై ఉన్నాడు. ఆయనపై అప్పట్లో వచ్చిన ఆరోపణలు వచ్చిన దానిపై ఇప్పుడు వైయస్ఆర్సీపీపై ఫాల్స్ కేసు ఫైల్ చేయించారు. అదే తన పాత పాలసీ ప్రకారం స్కామ్ చేసుకునేందుకు మధ్యలో వైయస్ఆర్సీపీపై స్కామ్ జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని వైయస్ జగన్ వివరించారు.
—-
