విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (11th International Yoga Day) సందడి మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది ఔత్సాహికులు తరలివచ్చారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్ కల్యాణ్, నారా లోకేశ్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.


