వైభవోపేతంగా గోదాదేవి కళ్యాణం… — దైవిక అనుభూతితో పులకించిన భక్తజనులు… — పెద్ద సంఖ్యలో భక్తుల హాజరు… ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మ తోటలోని దేవస్థానంలో నిర్వహించిన గోదాదేవి కళ్యాణం భక్తుల హృదయాలను పరవశింపజేసింది. శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ పుణ్యకార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో, వేద మంత్రోచ్చారణల నడుమ అత్యంత ఘనంగా సాగింది. ఆలయ ప్రాంగణం అంతటా మంగళవాయిద్యాల నాదాలు, సుగంధ పుష్పాల అలంకరణలు భక్తుల్లో ప్రత్యేకమైన ఆనందాన్ని నింపాయి. ధనుర్మాసం ఆరంభం నుంచి దేవస్థానంలో నిత్యం గోదాదేవి, శ్రీకృష్ణుల స్వామివార్లకు నిత్య కైంకర్యాలు అర్పించారు. అండాళ్గా ప్రసిద్ధి చెందిన గోదాదేవి, పరమభక్తితో విష్ణువునే వరుడిగా కోరిన మహానుభావురాలు. ఆమె భక్తి, త్యాగం, ప్రేమకు ప్రతీకగా ఈ కళ్యాణోత్సవాన్ని తిరుమలలో నిర్వహించడం విశేషంగా భావిస్తారు. గోదాదేవి కళ్యాణం ద్వారా భక్తి మార్గంలో నిలకడ, దైవానుభూతి ఎంత శ్రేష్ఠమో భక్తులకు తెలియజేస్తుంది. ధనుర్మాసం ముగింపు సందర్భంగా…
Author: apanalysis
ఒక చేయూత… వందల కలలకు వెలుగు 370 మంది విద్యార్థుల జీవితాల్లో ఆశల దీపం మానవీయతను చాటిన రాయల్ ట్రస్ట్. ఎం.గణేశ్, జర్నలిస్టు కలలు కన్న కళ్లకు ఆర్థిక అడ్డంకులు కనిపిస్తున్న వేళ, ఆ కలలకు ధైర్యం చెప్పే చేయూతే అసలైన సేవ. చదువుకోవాలనే తపన ఉన్నా, పరిస్థితులు సహకరించని వందలాది విద్యార్థుల జీవితాల్లో ఆశల వెలుగులు నింపుతూ రాయల్ సర్వీస్ ట్రస్ట్ మరోసారి తన మానవీయతను చాటింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలోని ఎన్.బి.కె. భవనంలో నిర్వహించి, అన్ని వర్గాలకు చెందిన 370 మంది విద్యార్థులకు రూ.33 లక్షల విలువైన స్కాలర్షిప్లను అందజేసింది. ఆప్టివల్ హెల్త్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ మరియు రాయల్ క్లబ్ విజయవాడ సౌజన్యంతో ఈ సహాయం అందింది. ఈ మొత్తంతో కలిపి ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు విద్యార్థులకు రూ.46 లక్షల స్కాలర్షిప్లు పంపిణీ…
సూపర్ స్పీడ్తో సూపర్ సిక్స్ హామీలు: కూటమి పాలనలో సంక్షేమం రెట్టింపు ఏపీ ఎనాలిసిస్, విజయవాడ రాష్ట్రంలో కూటమి పాలనలో సూపర్ సిక్స్ పథకాల అమలు సూపర్ స్పీడ్తో సాగుతున్నట్లు రాష్ట్ర ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు, “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం ద్వారా సుపరిపాలన అందిస్తోందన్నారు. మాటలతో కాదు, చేతల్లో చేసి చూపించడం నిజమైన సుపరిపాలన అని నమ్మిన సీఎం చంద్రబాబునాయుడు అదే విధంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని కొనియాడారు” సూపర్ సిక్స్ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా లాభం చేకూరుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల పాలనలో సుమారు రూ.70 వేల కోట్లు సూపర్ సిక్స్ పథకాలకు కేటాయించిందని, పెన్షన్ల కోసమే రూ.51 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆగస్టు 15 నుంచి అమలు చేసిన ఉచిత బస్సు పథకం “స్త్రీ శక్తి”కి ఇప్పటికే రూ.1200 కోట్లు…
పున్నమితోట టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. పున్నమితోట టీటీడీ కళ్యాణ మండపంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామి వారి దర్శనం పొందేందుకు మంగళవారం ఉదయం నుంచే భక్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేదీప్యమానంగా అలంకరించిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు, టీటీడీ సిబ్బంది, సేవకు వచ్చిన స్వచ్చంధ కార్యకర్తలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన ప్రతీ భక్తునికి ప్రసాద వితరణ చేశారు. మధ్యాహ్నం దాదాపు 10 వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. జిల్లా అధికారులు, నగరంలోని ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకుని తరించారు. ఆలయ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు, ఇన్స పెక్టర్ రమాదేవి ఆలయ అర్చకులు మురళి, శశి , హేమంత్ ఆనంద్ , నిర్వహకులు విజయ్ కుమార్ , ప్రసాద్ ప్రసాద్ రెడ్డి, ఏడుకొండలు,…
పోలవరం లేపిన రాజకీయ నామకరణాల చర్చ అమరజీవి సేవలకు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశ్యం ప్రశంసనీయం కానీ రాజకీయల కోసం పేరు మార్పులా?” ప్రజల్లో చర్చ ఎం.గణేశ్, ప్రధాన ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల పేర్లు కూడా మారిపోతున్నాయన్న విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. పాలన మారినా ప్రజల అవసరాలు మారవు, కానీ ఆ అవసరాలను తీర్చేందుకు రూపొందించిన పథకాలకు మాత్రం కొత్త పేర్లు పెట్టడం రాజకీయ సంస్కృతిగా మారిందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పేరు మరోసారి చర్చల కేంద్రంగా మారింది. రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు తొలుత రాజకీయ రంగు లేకుండా “పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు”గా ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, దీనికి “ఇందిరా సాగర్ (పోలవరం) బహుళార్ధ సాధక ప్రాజెక్టు” అనే పేరు పెట్టారు.…
ఆంధ్రా ట్యాక్సీతో సురక్షిత పర్యటనలకు శ్రీకారం పర్యాటకుల కోసం ప్రత్యేక యాప్ను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. పర్యాటక రంగ అభివృద్ధిలో ఎన్టీఆర్ జిల్లాను ముందంజలో నిలిపే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం “ఆంధ్రా ట్యాక్సీ” పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ యాప్ ద్వారా పర్యాటకులకు అందుబాటు ధరల్లో సురక్షితమైన, సౌకర్యవంతమైన విహారయాత్ర సేవలు అందించనున్నారు. ట్యాక్సీ, ఆటో బుకింగ్తో పాటు టూరిజం ప్యాకేజీలు, ఎన్టీఆర్ జిల్లా పర్యాటక సమాచారం, ఎస్వోఎస్ భద్రతా సేవలు ఈ యాప్లో అందుబాటులో ఉంటాయి. మొబైల్ యాప్తో పాటు క్యూఆర్ కోడ్, వాట్సాప్, వెబ్సైట్ ద్వారా కూడా సేవలను పొందవచ్చని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఆంధ్రా ట్యాక్సీ యాప్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో నెంబర్వన్ పర్యాటక కేంద్రంగా నిలిపేందుకు టీమ్ ఎన్టీఆర్ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు ఉపయోగపడేలా రుషికొండ ప్యాలెస్ ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. విశాఖలోని రుషికొండ ప్యాలెస్ను ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడో సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. సమావేశం అనంతరం మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ మాట్లాడుతూ హాస్పిటాలిటీ రంగానికి ప్యాలెస్ను వినియోగించాలనే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. అయితే సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండ కింద ఉన్న 9 ఎకరాల్లో 7 ఎకరాల్లో నిర్మాణాలు చేయడానికి వీలులేదని, వాస్తవంగా వినియోగానికి వచ్చే 2 ఎకరాలను ఎలా ఉపయోగించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. కొన్ని ప్రముఖ సంస్థలు ముందుకొచ్చినా ప్రాజెక్టు వయబుల్గా ఉండేలా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 28న మరోసారి సమావేశం నిర్వహించి తుది ప్రతిపాదనలను రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు మంత్రులు వెల్లడించారు.
పట్టణాలకే పరిమితం కాదు.. పేదల భోజనం గ్రామాల దాకా! సంక్రాంతికి 70 అన్న క్యాంటీన్లతో చంద్రబాబు ‘వెల్ఫేర్ రీ-లాంచ్’ ఎం.గణేశ్, జర్నలిస్టు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన అన్న క్యాంటీన్ల పథకం ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. పట్టణాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగను లక్ష్యంగా పెట్టుకుని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. జనవరి 10లోగా నిర్మాణ పనులు పూర్తిచేసి, జనవరి 13 నుంచి 15 మధ్యలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అన్న క్యాంటీన్ల పథకం తొలిసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో పట్టణ ప్రాంతాల్లో ప్రారంభమైంది. పేదలు, కూలీలు, వలస కార్మికులు, ఆసుపత్రుల వద్ద ఉండే బాధితులకు భోజనం కోసం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రారంభ దశలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ప్రజల…
పులివెందుల పర్యటన రద్దు ఏపీ అనాలిసిస్, విజయవాడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆయన పులివెందుల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించిన జగన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అయితే ఆ తర్వాత జ్వర తీవ్రత పెరగడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాబోయే కార్యక్రమాలు కూడా వాయిదా పడినట్లు సమాచారం.
సమాచార శాఖ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఏపీ ఎనాలిసిస్, విజయవాడ స్థానిక ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రెండవ అంతస్థులో గల సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని సెమీ క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి ఎల్. స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణలత మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయం తెలిపారు. ఉద్యోగులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం వంటి విలువలను క్రిస్మస్ సందేశం ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం మరింత బలపడేలా ఇటువంటి…