జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాదుల హత్యాకాండ నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో.. దేశీయ మదుపర్లూ జాగ్రత్తపడ్డారు. విదేశీ, దేశీయ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు చేపట్టినా, సాధారణ మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలకు వరుసగా రెండో రోజూ నష్టాలు తప్పలేదు. జనవరి- మార్చి త్రైమాసిక ఫలితాల ప్రభావంతో యాక్సిస్ బ్యాంక్ షేరు డీలా పడటమూ ప్రభావం చూపింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 పైసలు తగ్గి 85.40 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు 0.9% నష్టపోయి 65.96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో చైనా, సింగపూర్ మినహా మిగతా దేశాల సూచీలు లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ఆరంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.30 గంటలకు అమెరికా మార్కెట్ల ప్రధాన సూచీలైన డోజోన్స్ నష్టాల్లో, నాస్డాక్, ఎస్అండ్పీ లాభాల్లో కదలాడుతున్నాయి.మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ గత…
Author: apanalysis
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఖండించారు. ఈసందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ల మధ్య కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవ జరుగుతోందన్నారు. అయితే, దాన్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని తెలిపారు. రోమ్ పర్యటనకు బయల్దేరిన ట్రంప్ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా భారత్-పాక్ (India-Pakistan) ఉద్రిక్తతలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఆ రెండు దేశాలు నాకు చాలా దగ్గర. కశ్మీర్ విషయంలో భారత్, పాక్ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక, తాజాగా పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgram Terror Attack) చెత్త పని. ముష్కరుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. అయితే, ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన…
హరియాణాలోని జీంద్లో నలుగురు దుండగులు అయిదేళ్ల చిన్నారిని హత్య చేసి, తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు మంగళవారం రాత్రి భర్త లేని సమయం చూసి గుడిసెలోకి చొరబడ్డారు. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై దాడి చేశారు. ఆమెతోపాటు అయిదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్తకుప్ప వద్దకు ఎత్తుకెళ్లారు. అక్కడ చిన్నారి గొంతునులిమి హత్య చేసి, బాధితురాలిపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. గురువారం స్పృహలోకి వచ్చిన మహిళ జరిగిన దారుణాన్ని పోలీసులకు వెల్లడించింది. నిందితుల్లో అమిత్ అనే వ్యక్తితోపాటు ముగ్గురు మైనర్లు ఉన్నట్లు ఎస్.ఐ. యశ్వీర్ తెలిపారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ కుటుంబం పాకిస్థాన్కు చెందినదని, ఆమె తండ్రి గతంలో పాకిస్థాన్ సైన్యంలో పనిచేశారని, ఇమాన్వీని ‘ఫౌజీ’ నుంచి తొలగించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమాన్వీ స్పందించారు. తాను పాకిస్థాన్ అమ్మాయిని కాదంటూ సుదీర్ఘ వివరణను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘నా పైనా, నా కుటుంబ నేపథ్యంపైనా జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నాను. మా కుటుంబంలో ఏ ఒక్కరికీ పాకిస్థాన్ సైన్యంతో ఎలాంటి సంబంఽధం లేరు. మీడియా నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం నన్ను నిరుత్సాహానికి గురిచేసింది. నేను ఇండియన్ అమెరికన్ని అని గర్వంగా చెబుతున్నా. హిందీ, తెలుగు, గుజరాతి, ఆంగ్ల భాషలు మాట్లాడగలను. లాస్ ఏంజెల్స్లో జన్మించాను. మా తల్లిదండ్రులు ఆమెరికాకు వలస వచ్చారు. అక్కడే యూనివర్శిటీ విద్యను పూర్తి చేశాను. నటిగా, కొరియోగ్రాఫర్గా, డ్యాన్సర్గా రాణిస్తున్నాను. ఈ రంగంలో చాలా కాలం…
ఈ ఆధునిక యుగంలో జీవితాన్ని సంతోషకరంగా, సమర్థవంతంగా మార్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ దాన్ని ఎలా సాధించాలనే విషయంలో తడబడతారు. చిన్న చిన్న మార్పులతో మన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు. ఈ చిన్న మార్పులు మీ రోజువారీ జీవితంలో అద్భుతాలు సృష్టించగలవు. మన జీవనశైలిని, ఆరోగ్యాన్ని, కెరీర్ను ప్రభావితం చేస్తాయి. 1. చిన్న లక్ష్యాలతో పెద్ద విజయాలు పెద్ద లక్ష్యాలు భయపెడతాయి. కానీ చిన్న లక్ష్యాలు మాయాజాలం చేస్తాయి. రోజూ ఒక చిన్న పనిని సాధించండి. అంటే ఉదాహరణకు 10 నిమిషాలు ధ్యానం, 15 నిమిషాలు నడక, లేకపోతే ఒక పుస్తకంలో ఒక పేజీ చదవడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పరిశోధనల ప్రకారం 21 రోజుల పాటు ఒక అలవాటును కొనసాగిస్తే అది మీ జీవితంలో భాగమవుతుంది. ఒక నోట్బుక్లో మీ రోజువారీ లక్ష్యాలను రాసి, వాటిని ట్రాక్ చేయడం మొదలుపెట్టండి ఈ చిన్న అడుగు మిమ్మల్ని పెద్ద విజయాల…
‘జీవితం ఏమవుతుందో అనే అభద్రతాభావంతో ఉండే కంటే.. నేను సాధించగలనని మైండ్ సెట్ చేసుకుని ఎక్కువ దృష్టి పెట్టాలి. నేను అక్కడే సఫలీకృతుడిని అయ్యా’ అని ప్రముఖ సినీనటుడు చిరంజీవి చెప్పారు. ‘వ్యక్తిత్వం, ప్రవర్తన, మంచితనం.. అనేవి అదనపు ఆకర్షణలు. అత్యున్నత స్థానానికి వెళ్లినా నడత సరిగా లేకుంటే గుర్తింపు ఉండదు. మైండ్ సెట్కు షిప్ట్ అనేది చాలాచాలా అవసరం’ అని సూచించారు. చంద్రబాబు ధీరోదాత్తుడని.. అలిపిరి దాడి ఘటనలో పడిలేచిన ఆయనలో ఎంతో మానసిక స్థైర్యం చూశానని కొనియాడారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన ‘మైండ్ సెట్ షిప్ట్’ పుస్తకావిష్కరణ సభకు హాజరైన చిరంజీవి.. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. ‘జీవితం పూలపాన్పు కాదు. ప్రతిచోటా ఆటంకాలు వస్తుంటాయి. అయినా విజయం అందుకోలేక తప్పెక్కడ? అనుకుంటాం. మన ప్రయాణంలో ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. డిస్ట్రక్షన్ (విధ్వంసాలు), డిజప్పాయింట్మెంట్ (నిరుత్సాహం) వస్తుంటాయి. మిమ్మల్ని డీ మోటివేట్…
ప్రధాని మోడీ పైనే ఆశలు … మే 2న అమరావతి రాక … ఆహ్వానించేందుకు రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు… ఊపందుకున్న పనులు ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. అమరావతి అభివృద్ది ఆశలన్నీ ప్రధాని నరేంద్ర మోడీపైనే కానవస్తున్నాయి . మే 2 న ఆయన అమరావతికి రానున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూలు ఖరారు అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన్ను ఆహ్వానించేందుకు శుక్రవారం ఢిల్లీ వెళుతున్నారు. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోడీ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు . సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు కేంద్ర , రాష్ట్ర మంత్రులు తదితర కూటమి నాయకులు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా రాష్ట్ర సెక్రటేరియట్ కు చేరి అక్కడ స్వల్ప విరామం తీసుకుంటారు . అక్కడి నుంచి ఒకటి 1.1 కిలోమీటర్ల దూరంలో గల సభాస్థలి వరకు రోడ్ షో…
ఖనిజ సంపద అణ్యేషణ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు బంగారం, వజ్రాలతో పాటు మాంగనీస్, సున్నపురాయి నిక్షేపాల కోసం ప్రయత్నం. దశ తిరగనున్న శ్రీ సత్యసాయి, అనంతపురం, విజయనగరం, కడప జిల్లాలు జూన్ 6 వరకు బిడ్లు స్వీకరణ ఏపీ ఎనాలిసిస్, స్టేట్ బ్యూరో. సమీప భవిష్యత్ లో శ్రీ సత్యసాయి, అనంతపురం, కడప, విజయనగర జిల్లాల్లోని పరిస్ధితులు అనూహ్యంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడ అత్యంత విలువైన ఖనిజ సంపద ఉందని వివిధ పరిశోధనలు స్పష్టం చేశాయి. ఇందులో ప్రధానంగా బంగారం, వజ్రాలతో పాటు మాంగనీస్, సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం వాటి అన్వేషణ కు పెద్ద ప్రయత్నమే మొదలు పెట్టింది. ప్రవేట్ సంస్ధలకు ఈ అన్వేషణ టెండర్లలో పాల్గొనేందుకు జూన్ 6 వరకు గడువు కాలాన్ని నిర్ణయించింది. అదే విధంగా ఖనిజ సంపదను గుర్తించినవారికే లీజులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే జరిగితే ఆ జిల్లాల…
ఎవరూ ఊహించని రీతిలో ఇప్పటి దాకా ట్రోఫీని దక్కించుకోని ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లు పాయింట్ల పట్టికలో టాప్-5లో ఉంటూ ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకుపోతుంటే ఈ లీగ్లో అత్యంత విజయవంతమైన జైట్టెన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఆడిన 8 మ్యాచ్లకు గాను రెండింట్లోనే గెలిచి ఆరు ఓడి అట్టడుగున నిలవగా గత సీజన్ రన్నరప్ సన్రైజర్స్.. ఐదింట్లో ఓడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు జట్లతో పాటు ఐపీఎల్ తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ (6 ఓటములు) ప్లేఆఫ్స్ ఆశలు అటకెక్కినట్టే. సీజన్ ఆరంభంలో తడబడ్డా హ్యాట్రిక్ విజయాలతో కాస్త పుంజుకున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ దిశగా సాగుతున్నది. కుర్రాళ్లు.. లోకల్ లీగ్లు..ప్రతి సీజన్ మాదిరిగానే 2025లోనూ ఐపీఎల్కు కొత్త నీరు వరదలా వెల్లువెత్తుతున్నది. ప్రియాన్ష్ ఆర్య, దిగ్వేశ్ రాఠి, విప్రాజ్ నిగమ్, అనికేత్ వర్మ, విఘ్నేశ్…