శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. లాకర్లో ఉంచిన రూ.38 లక్షల నగదు, 10 కేజీల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. డీఎస్పీ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురం గ్రామీణ మండలం తూముకుంట పారిశ్రామికవాడలోని ఎస్బీఐకి వెనుక వైపునున్న కిటికీని దుండగులు కట్టర్తో కోసి బ్యాంకులోకి చొరబడ్డారు. వెంటనే సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. లాకర్ గదికి వేసిన తాళాలను కట్టర్తో కోసి అందులోని రూ.38 లక్షల నగదుతో పాటు మూడు ట్రేలల్లో ఉంచిన 10 కేజీల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం బ్యాంకు అధికారులు దోపిడీ జరిగినట్లు గుర్తించారు. డీఎస్పీ మహేశ్, సీఐ అబ్దుల్కరీం ఘటనా స్థలికి వచ్చి ఆధారాలు సేకరించారు. కాగా, బ్యాంకుకు నాలుగేళ్ల నుంచి సెక్యూరిటీ గార్డ్ లేరని, దీనిపై బ్యాంకు వారిని తాము ముందే హెచ్చరించినా ఏర్పాటు చేయలేదని డీఎస్పీ చెప్పారు.
Author: apanalysis
చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రానున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’ (Vishwambhara). దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాల కోసం చిరు అభిమానులతో పాటు సినీప్రియులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సంగతులు పంచుకున్నారు. దీని టీజర్ విడుదలయ్యాక ‘అవతార్’కు కాపీ అంటూ వచ్చిన ట్రోల్స్పై మాట్లాడారు. ‘‘టీజర్ నాకు నచ్చింది కాబట్టి నేను రిలీజ్ చేశాను. అందులో కనిపించిన పాప కాస్ట్యూమ్ను చూసి అందరూ నేను అవతార్ సినిమా కాపీ చేసి దాన్ని రూపొందించానని అన్నారు. టీజర్లో కనిపించిన కొండలు, ఆ పాప చెవులు చూసి అలా భావించారు. కానీ, కొండలను ‘అవతార్’ కంటే ముందు ఎన్నో సినిమాల్లో చూపించారు. ఇక చెవులు కూడా పెద్దగా ఉండడం గతంలో చాలా సినిమాల్లోని పాత్రల్లో చూపారు. నేను చందమామ కథలు చూసి స్ఫూర్తి పొంది అలా కాస్ట్యూమ్ డిజైన్ చేయించాను. అవతార్ చూసి కాపీ…
అధిక సంఖ్యలో హాజరైన భక్తులు ఏపీ ఎనాలిసిస్, విజయవాడ విజయవాడ పున్నమ్మతోటలోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్ధానంలో శనివారం నుంచి అష్టబంధన జీర్ణోద్దారణ మహా సంప్రోక్ష్లణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం9 గంటల నుంచి 12 గంటల వరకు నవగ్రహారాధన, నవగ్రహ మఖము, ప్రధాన హోమములు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని తిలకించారు. సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు ఉక్త హోమములు, కుంభారాధనలు, అభిమంత్రణములు వైభవంగా జరిగాయి. ఆలయ అధికారులు మల్లికార్జునరావు, లలిత, ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ, శశికిరణ్, ఆనంద్ భక్తులు వేణు, విజయకుమార్, ప్రసాద్ రెడ్డి, న్యాయవాదులు ప్రసాద్ వెంకటేశ్వరరావు, ఏడుకొండలు, ట్రాన్స్ పోర్టు కంట్రాక్టరు వెన్న నారాయణరావు, వేదపండితులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులుకొనుగోలుదారులకు వాట్పాప్ లో ఒరిజినల్ డాక్యుమెంట్పారదర్శంగా రిజిస్ట్రేషన్లుఏపీలో పలు ప్రాంతాల్లో అమలులోకి వచ్చిన కొత్త విధానం ఎం.గణేశ్..ఏపీ ఎనాలిసిస్రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకదాని తరువాత మరొక నూతన విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తుంది. కొనుగోలుదారులు, అమ్మకందారులకు ఎటువంటి ఇబ్బంది కలిగించని రీతిలో పనులు వేగంగా జరిగిపోతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఏపీలోని పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొనుగోలుదారులకు పది నిముషాల్లోనే ఒరిజినల్ డాక్యుమెంట్లను అధికారులు ఇచ్చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత నాలుగైదు రోజుల తరువాతనే కొనుగోలుదారులకు డాక్యుమెంట్లను ఇచ్చే విధానం నిన్న మొన్నటి వరకు కొనసాగింది. ఇందులోను కొనుగోలుదారుల నుంచి కమిషన్లు వచ్చిన తరువాతనే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వాటిని ఇచ్చేవారు. ఇప్పుడలా లేదు. పరిస్ధితులు అనూహ్యంగా మారిపోయాయి. రిజిస్ట్రేషన్ పై కొనుగోలుదారులకు ఏ మాత్రం అవగాహన ఉన్నా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా మొత్తం చెల్లించి ఒరిజినల్ డాక్యుమెంట్లు పొందే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇలానే…
క్లబ్ సేవలు విస్తరించడానికి సభ్యులంతా ఐక్యంగా పని చేయాలి కొత్త సభ్యులను చేర్పించాలి. మేధావులు, సీనియర్ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి రాయల్ క్లబ్ నెలవారీ సమావేశం ఎం.గణేశ్, ఎపీ ఎనాలిసిస్ రాయల్ క్లబ్ సేవలు విస్తరించడానికి సభ్యులంతా ఐక్యంగా పని చేయాలని ఇమడాబత్తుల నరహరి కోరారు. వెస్టిన్ కాలేజిలో ఆదివారం సాయంత్రం రాయల్ క్లబ్ నెలవారీ సమావేశం జరిగింది. సభ్యులు క్లబ్ విస్తరణ, కాపు సామాజికవర్గానికి సేవలు అందించే విషయంలో పలు సూచనలు చేశారు. వీటి అమలు ద్వారా కాపు సామాజికవర్గం అభ్యున్నతికి దోహదపడాలని ప్రతినబూనారు. కొత్త సభ్యులను చేర్పించే విషయంలో అందరూ శ్రద్ద వహించాలన్నారు. సభ్యుల సంఖ్య పెరిగినప్పుడే సేవా కార్యక్రమాలను పెంచే అవకాశం ఉంటుందన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రతీ సభ్యుడు మరుసటి నెల సమావేశంలోపు మరి కొంత మంది కొత్త సభ్యులను చేర్చించాలని కోరారు. కాపు సామాజికవర్గానికి చెందిన పేద విద్యార్ధులకు ఫీజులు, పుస్తకాలు వంటి…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సింగపూర్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్తో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై వారు చర్చించారు. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని మంత్రి టాన్ సీ లెంగ్కు సీఎం స్పష్టం చేశారు. సింగపూర్పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించినట్లు తెలిపారు. నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని టాన్ సీ లెంగ్ను కోరారు. సింగపూర్ను చూసే హైదరాబాద్లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్,…
కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్ను తగ్గించుకుంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సైతం భారీగా ఉద్యోగాల కోత (Lay Offs)కు సిద్ధమైంది. కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్ను తగ్గించుకుంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సైతం భారీగా ఉద్యోగాల కోత (Lay Offs)కు సిద్ధమైంది. వచ్చే ఏడాది వరకూ తమ స్టాఫ్లో 1,200 వేల మందిని తొలగించనుందీ కంపెనీ. ప్రధానంగా మధ్య స్థాయి, సీనియర్ హోదాలోని వాళ్లను ఇంటికి పంపేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు ఆదివారం మనీ కంట్రోల్ వార్తా సంస్థతో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే.కృతివాసన్ వెల్లడించారు.
ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వాళ్లకు మాత్రమే హార్ట్ ఎటాక్లు వచ్చేవి. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారితోపాటు చిన్నారులకు కూడా గుండె పోటు వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు సన్నగా ఉంటారు కానీ వారిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని, లావుగా ఉన్నంత మాత్రాన కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నట్లు కాదని, సన్నగా ఉన్నవారికి కూడా హార్ట్ ఎటాక్లు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా, హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఇందుకు గాను నిత్యం మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓట్స్..శరీరంలో ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలు అధికంగా ఉంటే…
ఇటీవల థియేటర్కు వచ్చిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రం అడియన్స్ నుంచి మిశ్రమ స్పందనను రాబట్టింది. రిలీజైన అన్ని చోట్ల నుంచి మంచి కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమాకు సెకండాఫ్ కాస్త ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మేకర్స్ వాటిపై దృష్టి పెట్టి వాటిని సరి చేసే పనికి పూనుకున్నారు. దీంతో ఇప్పుడు మూవీ సెకండాఫ్ విషయంలో అడియన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. నెగిటీవిటీ వ్యాపింప జేస్తున్న వారు సైతం సైలెంట్ అయ్యారు.పైగా సినిమా బావుందంటూ కితాబిస్తున్నారు. దీంతో ఇప్పుడు మరోమారు బ్లాక్బస్టర్ హరిహార వీరమల్లు (#BlockBusterHariHaraVeeraMallu) అంటూ నేషనల్ వైడ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది.అయితే.. మేకర్స్ కాస్త ఆలస్యంగానైనా మేల్కొని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడడెక్కడ అయితే సినిమాలోని సన్నివేశాలపై విమర్శలు వచ్చాయో వాటిని ట్రిమ్ చేయడం, లేదా అప్డేట్ చేసి మొత్తం మూవీని సరి కొత్తగా మార్చి కొత్త ప్రింట్ను…
మంత్రులు, శాసన సభ్యుల నుంచి వెలువడని స్పష్టమైన ప్రకటనవిజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మంత్రి సారధిల నుంచి స్పందనఇద్దరు పేద బాలికలను దత్తత చేసుకున్న చలసాని, ఐఐటీ సీటు సాధించిన విద్యార్ధులకు సాయం ప్రకటించిన మంత్రి సారధిఏపీ ఎనాలిసిస్, విజయవాడ.ముఖ్యమంత్రి చంద్రబాబు అమలులోకి తీసుకువచ్చిన పీ-4 పట్ల శాసన సభ్యుల నుంచి స్పందన కనిపించడం లేదు. ఈ పథకం అమలు పట్ల ప్రజాప్రతినిధులు ఇంత వరకు పెద్దగా దృష్టి సారంచ లేదు. ఒకరిద్దరు ఆ పథకం గురించి ప్రస్తావించకుండానే పేదలకు, మెరిట్ విద్యార్ధులను ప్రోత్సహించేందుకు తమ సొంత నగదు ఖర్చు చేస్తామని ముందుకు వచ్చారే కానీ పీ-4 పథకం పట్ల ఆసక్తి కనపరచలేదు. దీనిపై ఇంత వరకు ఎవరూ బహిరంగ ప్రకటన చేయలేదు. కూటమి ప్రభుత్వంలో ఆర్ధికంగా వెసులుబాటు కలిగిన మంత్రులు, శాసన సభ్యులు, ప్రభుత్వ కార్పొరేషన్ల పదవులు నిర్వహిస్తున్న వారి సంఖ్యకు కొదవే లేదు. ఈ పథకం అమలు…